ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-04-12T05:17:52+05:30 IST
కోటగండ్రేడు గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
గుర్ల, ఏప్రిల్ 11: కోటగండ్రేడు గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆనందపురం గ్రా మానికి చెందిన అప్పలనాయుడు, పైడి నాయుడు, దొరబాబు కలిసి కూలి పనుల నిమిత్తం బూర్లెపేట వెళ్లి తమ సొంత ఆటోపై కూలి పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా మధ్యలో అడ్డంగా కుక్క రావడంతో అదుపుతప్పి ఆటో ఒక్క సారిగా బోల్తా పడింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పీహెచ్సీలో వైద్యం నిర్వహించి అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి 108 ద్వారా తరలించారు.