అంగడిపేట ఆటో ప్రమాదంలో 10కి చేరిన మృతులు

ABN , First Publish Date - 2021-01-24T04:22:51+05:30 IST

అంగడిపేట ఆటో ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటమ్మ మృతి చెందారు. మరో..

అంగడిపేట ఆటో ప్రమాదంలో 10కి చేరిన మృతులు

నల్గొండ: అంగడిపేట ఆటో ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటమ్మ మృతి చెందారు. మరో తొమ్మిది మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. కాగా పీఏపల్లి మండలం అంగడిపేటలో గురువారం రోజున  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు, క్షతగాత్రులు చింతబావికి చెందిన రోజువారీ కూలీలు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఎదురుగా వస్తున్న బోలెరోను తప్పించబోయి లారీ-ఆటో ఢీకొన్నాయి. 


Updated Date - 2021-01-24T04:22:51+05:30 IST