బైకును ఢీకొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2021-04-16T05:32:54+05:30 IST
కొమరాడ మండలం శివిని గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని పార్వతీపురం ప్రాంతీ య ఆసుపత్రి పోలీసులు తెలిపారు.
బెలగాం, ఏప్రిల్ 15: కొమరాడ మండలం శివిని గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని పార్వతీపురం ప్రాంతీ య ఆసుపత్రి పోలీసులు తెలిపారు. పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామా నికి చెందిన వాన గోపాలరావు, బడే వేణులు బైకుపై కొమరాడ మండలం గుణా నుపురం వెళ్లి, తిరిగి వస్తుండగా శివిని గ్రామ చెరువు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపాలరావుకు తీవ్ర గాయాలు కాగా, వేణుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అదే ఆటోలో ప్రాంతీయ ఆసుపత్రికి తర లించి, వైద్యం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.