ఆటో, బైక్‌ ఢీ : యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-03-01T05:17:30+05:30 IST

మండల పరిధిలోని వరకాయపూడి రాజరాజేశ్వరి రైస్‌ మిల్లు దగ్గర ఆటో, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ యుడకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

ఆటో, బైక్‌ ఢీ : యువకుడి మృతి
ప్రమాదంలో మృతి చెందిన కిరణ్‌

 తోటపల్లిగూడూరు, ఫిబ్రవరి 28 : మండల పరిధిలోని వరకాయపూడి రాజరాజేశ్వరి రైస్‌ మిల్లు దగ్గర ఆటో, బైక్‌  ఢీకొన్న ఘటనలో ఓ యుడకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..  రైస్‌మిల్లు వద్ద ఆటో, బైక్‌ను ఢీకొనడంతో మోటార్‌ సైక్లిలిస్ట్‌ తమ్మిరెడ్డి కిరణ్‌(25) మృతి చెందాడు. మృతుడు తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీ మజారా నెలిమిట్టకండ్రిగకు చెందిన తమ్మిరెడ్డి వెంకటసుబ్బయ్య కుమారుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆటో పంటకాలువలో దూసుకుకెళ్లిందని, ఆటోలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు   తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-03-01T05:17:30+05:30 IST