నీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలం

ABN , First Publish Date - 2022-06-26T05:03:32+05:30 IST

మండలంలోని పలు తండాల్లో మిషన్‌భగీరథ ద్వారా తాగు నీటి సరఫరాలో అధికారులు విఫలమయ్యారని పలు గ్రామాల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.

నీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ

మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల ఆవేదన

శివ్వంపేట, జూన్‌ 25: మండలంలోని పలు తండాల్లో మిషన్‌భగీరథ ద్వారా తాగు నీటి సరఫరాలో అధికారులు విఫలమయ్యారని పలు గ్రామాల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎంపీపీ హరికృష్ణ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలు శాఖలకు సంబంధించిన సమస్యలపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శివ్వంపేటలో లక్షల రూపాయలు వెచ్చించి గోదావరి జలాల కోసం ఏర్పాటు చేసిన సంపు నిర్మాణం పూర్తయి రోజులు గడుస్తున్నా ప్రారంభించడం లేదని పలువురు సభ్యులు పేర్కొన్నారు. శివ్వంపేట పెద్దచెరువు ఆక్రమానికి గురైందని అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచు శ్రీనివా్‌సగౌడ్‌ సభ దృష్టికి తీసుకొచ్చారు. సర్వే చేసి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ శ్రీనివా్‌సచారి పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ కోఆప్షన్‌ మన్సూర్‌, ఎంపీడీవో నవీన్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-26T05:03:32+05:30 IST