చైనా మాంజపై అధికారుల నిషేధం
ABN , First Publish Date - 2022-01-14T01:45:34+05:30 IST
రాష్ట్రంలో చైనా మాంజపై అధికారులు నిషేధం విధించారు. సంక్రాంతి
హైదరాబాద్: రాష్ట్రంలో చైనా మాంజపై అధికారులు నిషేధం విధించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చైనా మాంజ అమ్మకాలు ఎక్కువగా జరిగే దుకాణాలపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. నగరంలోని ధూల్ పెట్, బేగం బజార్లో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు దుకాణాల్లో నిలువ చేసిన చైనా మాంజను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.