ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు అవి నేర్చుకోవాల్సిందే: బ్రెట్‌ లీ

ABN , First Publish Date - 2020-08-10T02:40:42+05:30 IST

వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్-2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఈ టోర్నీని భారత్‌‌లో...

ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు అవి నేర్చుకోవాల్సిందే: బ్రెట్‌ లీ

కాన్‌బెర్రా: వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్-2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఈ టోర్నీని భారత్‌‌లో కాకుండా యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో పాల్గొనే ఆటగాళ్లందరూ బయోబబుల్‌ విధానాన్ని పాటించేలా బీసీసీఐ పటిష్ఠ నిబంధనలు అమలు చేయనుంది. దీనిపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రెట్‌‌లీ స్పందించాడు. మునుపటిలా మ్యాచ్ అనంతరం సినిమాలకు, పార్టీలకు వెళ్లేందుకు ఆటగాళ్లకు అవకాశం లేదని, ఇక వేరే మార్గాల్లో ఖాళీ సమయం గడపాలని అన్నాడు. ‘క్రికెటర్లంతా ఇక గిటార్ వాయించడం, కార్డ్స్ ఆడుకోవడం ప్రాక్టీస్ చేసుకోండి. అవే మీకు టైం పాస్ అవుతాయి. వాటి ద్వారా బయోబబుల్ విధానాన్ని పాటించగలుగుతార’ని బ్రెట్‌లీ చమత్కరించాడు.

Updated Date - 2020-08-10T02:40:42+05:30 IST