రెండో వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ !
ABN , First Publish Date - 2020-11-29T14:38:35+05:30 IST
ఇక్కడి సిడ్నీ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
సిడ్నీ: ఇక్కడి సిడ్నీ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వన్డే ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతుంటే... కంగారు జట్టు ఒక మార్పు చేసింది. ఆల్రౌండర్ స్టానిక్స్ స్థానంలో హెన్రిక్స్ను తీసుకుంది. ఇక మూడు వన్డేల సిరీస్లో భాగంగా మొదటి వన్డేలో ఓడిన భారత్ సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. అటు మొదటి వన్డేలో విజయంతో జోష్లో ఉన్న కంగారులు.. ఈ వన్డేలో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.
భారత జట్టు: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బూమ్రా
ఆసీస్ జట్టు: అరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్మిత్, లబుషేన్, మ్యాక్సెవెల్, హెన్రిక్స్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జంప, హాజెల్వుడ్