పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లిష్ బౌలర్ల దెబ్బకు విలవిల
ABN , First Publish Date - 2021-10-31T01:49:05+05:30 IST
టీ20 ప్రపంచకప్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో
దుబాయ్: టీ20 ప్రపంచకప్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి విలవిల్లాడుతోంది. ఏడు పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ మిల్లర్ (1) వికెట్ను కోల్పోయిన ఆసీస్.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది.
స్టీవ్ స్మిత్ (1), మ్యాక్స్వెల్ (6), స్టోయినిస్ (0) వంటి కీలక ఆటగాళ్లను 21 పరుగులకే కోల్పోయింది. ఇంగ్లిష్ బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న ఆసీస్ బ్యాట్స్మెన్ వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ చేరుతున్నారు.
మరీ ముఖ్యంగా క్రిస్ వోక్స్ నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్మెన్ను భయపెడుతున్నాడు. మూడు ఓవర్లలో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన వోక్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పది ఓవర్లు ముగిశాయి. ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (19), మాథ్యూ వేడ్ (11) క్రీజులో ఉన్నారు.