బ్రిస్బేన్ టెస్ట్: ఆసీస్ 369 ఆలౌట్
ABN , First Publish Date - 2021-01-16T13:40:29+05:30 IST
గబ్బా వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న ఆఖరిదైన నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఆతిథ్య ఆసీస్ 369 పరుగులకు ఆలౌట్ అయింది.
బ్రిస్బేన్: గబ్బా వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న ఆఖరిదైన నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఆతిథ్య ఆసీస్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. 274/5తో రెండో రోజు ఆట కొనసాగించిన కంగారు జట్టు మరో 95 పరుగులు జోడించి మిగత ఐదు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్లో లుబుషేన్ శతకం(108)తో రాణిస్తే.. కెప్టెన్ టిమ్ పైన్ హాఫ్ సెంచరీ(50), కామెరాన్ గ్రీన్(47), మాథ్యూ వేడ్(45) పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్, శార్దూల్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక వికెట్ తీశాడు.