ఎక్కడో తేడా జరిగింది: కమిన్స్
ABN , First Publish Date - 2021-05-06T09:36:09+05:30 IST
కరోనా ప్రబలుతున్నా.. స్వదేశంలోనే ఐపీఎల్ను నిర్వహించాలని నిర్ణయించినప్పుడు కొన్ని విషయాల్లో తొందరపడినట్టుగా అనిపించిందని ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. గతేడాది యూఏఈలో
కరోనా ప్రబలుతున్నా.. స్వదేశంలోనే ఐపీఎల్ను నిర్వహించాలని నిర్ణయించినప్పుడు కొన్ని విషయాల్లో తొందరపడినట్టుగా అనిపించిందని ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. గతేడాది యూఏఈలో నిర్వహించిన లీగ్ను ఎంతో చక్కగా నిర్వహించారని కితాబిచ్చాడు. ఆ అనుభవంతోనే ఈ ఏడాది స్వదేశంలో నిర్వహించడానికి ధైర్యం చేసి ఉంటారన్నాడు. కానీ, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కొన్ని విషయాల్లో చూసీ చూడనట్టుగా వ్యవహరించారని అనిపించిందని కమిన్స్ చెప్పాడు. కానీ, కచ్చితమైన కారణాలను మాత్రం చెప్పలేకపోయాడు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే.. ఐపీఎల్ను కొనసాగించడమేంటనే విమర్శలు వినిపిస్తున్న తరుణంలో ఆ రెండు భిన్నమైనవని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.