రోడ్డు ప్రమాదంలో 17ఏళ్ల మీ మేనల్లుడు చనిపోయాడంటూ ఫోన్.. షాకింగ్ న్యూస్తో ఆ మేనత్తకు గుండెపోటు.. చివరకు..
ABN , First Publish Date - 2022-01-08T01:17:35+05:30 IST
అతడికి 17ఏళ్లు. తమ్ముడితో కలిసి సరదాగా మేనత్త ఇంటికి వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపి తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఇంతలో ఘోరం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆ యువకు
ఇంటర్నెట్ డెస్క్: అతడికి 17ఏళ్లు. తమ్ముడితో కలిసి సరదాగా మేనత్త ఇంటికి వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపి తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఇంతలో ఘోరం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆ యువకుడు మరణించాడు. మేనల్లుడి మరణ వార్తను విని.. మేనత్తకు గుండెపోటు వచ్చింది. చివరికి ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ ప్రాంతానికి చెందిన ఆదిత్య (17) సోదరుడు కన్హయ్యతో కలిసి బైక్పై చప్పర్ గ్రామంలో ఉన్న తన మేనత్త సుశీల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమెతో సరదాగా గడిపాడు. బుధవారం సాయంత్రం ఇంటికి తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలోనే ఎదురుగా వచ్చిన ట్రక్కు.. ఆదిత్య బైకును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆదిత్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కన్హయ్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆదిత్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఆదిత్య మరణవార్త సుశీలకు తెలియడంతో ఆమె తట్టుకోలేకపోయింది. గుండెపోటుతో కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో ఆదిత్య స్వగ్రామం సహా చప్పర్ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.