Audi India: కస్టమర్లకు తీపికబురు
ABN , First Publish Date - 2021-07-16T02:25:36+05:30 IST
Audi India: కస్టమర్లకు తీపికబురు
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త కార్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆడి ఇండియా ఇ-ట్రోన్, ఇ-ట్రోన్ స్పోర్ట్ బ్యాక్ కస్టమర్ల కోసం ఛార్జింగ్ ఎంపికలను ప్రకటించింది. జూలై 22, 2021న రెండు ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ప్రారంభించనున్నట్లు ఆడి ఇండియా పేర్కొంది. భారతదేశంలో ఆడి డీలర్షిప్లలో 50 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్లు ఉంటాయని, దశలవారీగా ఏర్పాటు చేయబడుతుందని సంస్థ తెలిపింది.