20, 21 తేదీల్లో పాడైపోయిన ప్రభుత్వ వాహనాల వేలం
ABN , First Publish Date - 2020-08-13T15:53:07+05:30 IST
20, 21 తేదీల్లో పాడైపోయిన ప్రభుత్వ వాహనాల వేలం
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి) : వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన పాడైపోయిన వాహనాలను ప్రభుత్వం 20, 21 తేదీల్లో వేలం వేయనుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏ శాఖ వద్ద ఎన్ని పాడైపోయిన వాహనాలున్నాయన్న వివరాలను సాధారణ పరిపాలన శాఖ సేకరించింది. మొత్తం 706 వాహనాలుండగా, ఇందులో 684 పాడైపోయిన వాహనాలు కాగా, 22 మాత్రం పని కొచ్చే వాహనాలున్నాయి. పాడైన వాహనాలను మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసి ఆఫ్సెట్ ప్రైస్ను నిర్ణయించారు. ఈ మేరకు వాటిని వేలం వేస్తారు. వాస్తవానికి వివిధ శాఖల వద్ద పడి ఉన్న పాత వాహనాలను వేలం ద్వారా విక్రయించాలంటూ ఇటీవల జరిగిన కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. న్యాయ శాఖలోని జడ్జీలు, అధికారుల వద్ద ఉన్న పాత వాహనాలను ఇటీవలే ప్రభుత్వం వెనక్కి తెప్పించింది. ఆ వాహనాలను 20, 21 తేదీల్లో వేలం ద్వారా విక్రయించనుంది.