IPL 2022: వచ్చే నెలలో కొత్త జట్లకు వేలం!

ABN , First Publish Date - 2021-09-15T02:35:52+05:30 IST

ఐపీఎల్ వచ్చే సీజన్‌లో కొత్తగా రాబోతున్న రెండు జట్ల కోసం అక్టోబరు 17న ఈ-బిడ్డింగ్ నిర్వహించేందుకు బీసీసీఐ

IPL 2022: వచ్చే నెలలో కొత్త జట్లకు వేలం!

న్యూఢిల్లీ: ఐపీఎల్ వచ్చే సీజన్‌లో కొత్తగా రాబోతున్న రెండు జట్ల కోసం అక్టోబరు 17న వేలం పాట నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కొత్త జట్ల కోసం బీసీసీఐ ఆగస్టు 31న టెండర్లు విడుదల చేసింది. అక్టోబరు 5తో ఆ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 17 వేలం నిర్వహించనున్నట్టు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. ఐపీఎల్‌లో ప్రస్తుతం 8 జట్లు ఉండగా, వచ్చే సీజన్ నుంచి ఆ సంఖ్య పదికి పెరగనుంది. ఇక కొత్త ఫ్రాంచైజీలు  అహ్మదాబాద్, లక్నో, పూణె వేదికలుగా ఉండే అవకాశం ఉంది. 

Updated Date - 2021-09-15T02:35:52+05:30 IST