ఏయూ రిజిస్ట్రార్ బూతులు తిట్టారు: ప్రేమానందం
ABN , First Publish Date - 2020-06-02T23:41:08+05:30 IST
ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ బూతులు తిట్టారని ప్రొఫెసర్ ప్రేమానందం ఆరోపించారు. యూనివర్సిటీకి పేరు వచ్చే
విశాఖ: ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ బూతులు తిట్టారని ప్రొఫెసర్ ప్రేమానందం ఆరోపించారు. యూనివర్సిటీకి పేరు వచ్చే కార్యక్రమం చేసినట్లు తెలిపారు. దానికి చేసిన ఖర్చును తిరిగి ఇవ్వాలని అడిగానన్నారు. సంతకం కోసం 7 రోజులు తిప్పారని ఆరోపించారు. 7 రోజులు ఎందుకు పట్టిందని అడిగినందుకు.. బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్స్టేషన్లో రిజిస్ట్రార్ కృష్ణమోహన్పై అట్రాసిటీ కేసు పెట్టానని.. 3 రోజులు అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. కేసు పెట్టినందుకు పోలీసులు తననే వేధిస్తున్నారని వాపోయారు. ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ను తొలగించాలని ఏబీఎన్తో మాట్లాడుతూ ఆయన డిమాండ్ చేశారు.
ప్రొఫెసర్పై ఇలా వ్యవహరించడం దారుణం: హర్షకుమార్
గౌరవించాల్సిన ప్రొఫెసర్పై ఇలా వ్యవహరించడం దారుణమని మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యానించారు. వీసీలు, రిజిస్ట్రార్లు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. ఒక హెచ్వోడీ పట్ల రిజిస్ట్రార్ తీరు సరికాదని తప్పుపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. దళిత ప్రొఫెసర్ను అవమానించిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సంతకం కోసం ఒక ప్రొఫెసర్ 7 రోజులు తిరగడం ఎన్నడూ లేదన్నారు.