దేశ వ్యాప్తంగా 'సత్యాగ్రహం'
ABN , First Publish Date - 2022-06-09T23:33:04+05:30 IST
Delhi: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈనెల 13న రాహుల్ గాంధీ ఈడీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజు కాంగ్రెస్ నాయకులు దేశ వ్యాప్తంగా 'సత్యాగ్రహం' నిర్వహించనున్నట్లు సమాచారం.
Delhi: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈనెల 13న రాహుల్ గాంధీ ఈడీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజు కాంగ్రెస్ నాయకులు దేశ వ్యాప్తంగా 'సత్యాగ్రహం' నిర్వహించనున్నట్లు సమాచారం. పార్టీ ఎంపీలు, వర్కింగ్ కమిటీ సభ్యులు ఏఐసీసీ నుంచి ఈడీ ప్రధాన కార్యాలయం వరకు పాదయాత్ర చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు.