వివాహితపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-02-28T05:33:05+05:30 IST

వివాహితపై ఓ యువకుడు అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివాహితపై అత్యాచారం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ఫిరంగిపురం, ఫిబ్రవరి 27: వివాహితపై ఓ యువకుడు అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణా నుంచి వచ్చిన ఓ మహిళ బేతపూడి వద్ద తనపిల్లలతో కలిసి రోల్డ్‌గోల్డ్‌, నల్లపూసలు విక్రయిస్తూ రోడ్డు పక్కన టెంటు వేసుకుని జీవనం సాగిస్తోంది. అదే గ్రామానికి చెందిన చెవుల చంద్రబోసు తనపై గురువారం రాత్రి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. చంద్రబోసు దాడి చేయడంతో గాయాలయ్యాయని పేర్కొంది. ఆమెను 108 ద్వారా నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. 

Updated Date - 2021-02-28T05:33:05+05:30 IST