కళాశాలపై నుంచి దూకేసి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-02-28T06:21:08+05:30 IST

చిత్తూరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం జరిగింది.

కళాశాలపై నుంచి దూకేసి  డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

చిత్తూరు, ఫిబ్రవరి 27: చిత్తూరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం జరిగింది. విద్యార్థిని ఆత్మహత్య సంఘనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తేనెబండకు చెందిన యామిని కొంగారెడ్డిపల్లెలో ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కళాశాల యాజమాన్యం ఫీజులు చెల్లించాలని పలుమార్లు అడగటంతో.. చెల్లించలేని స్థితిలో కళాశాల రెండో అంతస్థుపై నుంచి కిందకు దూకేసిందని ఓ ప్రచారం నడుస్తోంది. అలాగే సాయంత్రానికి మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు మందలించగా... కళాశాలపై నుంచి దూకేసిందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఆ విద్యార్థిని రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-02-28T06:21:08+05:30 IST