వివాహిత కిడ్నాప్‌కు యత్నం

ABN , First Publish Date - 2022-08-16T05:41:56+05:30 IST

ములకలచెరువులో ఓ వివాహత కిడ్నాప్‌కు యత్నించిన భర్తతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ డీవై స్వామి తెలిపారు.

వివాహిత కిడ్నాప్‌కు యత్నం

ములకలచెరువు, ఆగస్టు 15: ములకలచెరువులో ఓ వివాహత కిడ్నాప్‌కు యత్నించిన భర్తతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ డీవై స్వామి తెలిపారు. ములకలచెరువులోని వినాయకనగర్‌లో నివాసమున్న కొత్తరెడ్డి సునీతపై అనుమానంతో ఆమె భర్త తలారి ప్రసాద్‌బాబు భర్త చెల్లెలు రేణుకా, చెల్లెలు భర్త సుబ్రమణ్యంలు  ఈ నెల 11న కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై గృహ హింస, కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

మహిళ అదృశ్యం.. కేసునమోదు


నిమ్మనపల్లె, ఆగస్టు 15: మండలంలోని కొండయ్యగారిపల్లె పంచాయతి కోళ్లఫారం వద్ద వున్న జగనన్న కాలనీ పక్కన కాపురం వుంటున్న జి.దేవి(28) కనిపించలేదని ఆమె భర్త లక్ష్మన్న సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఎస్‌ఐ ఫాతీమా తెలిపారు.   లక్ష్మన్న, దేవిలకు ముగ్గురు పిల్లలు వున్నారని అయితే 3నెలలుగా దేవి మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలిపారు. వారం రోజులగా  కనిపించకుండా పోవడంతో సోమవారం ఆమె భర్త లక్ష్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే గతంలో కూడా దేవి వివాహేతర సంబంధంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.  

Updated Date - 2022-08-16T05:41:56+05:30 IST