గుమ్మడిదలలో అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ యత్నం
ABN , First Publish Date - 2022-01-15T04:54:28+05:30 IST
గుమ్మడిదల మండల కేంద్రంలోని డీసీసీబీ ఏటీఎంలో గుర్తు తెలియని దొంగలు గురువారం అర్ధరాత్రి చోరీకి యత్నించారు.
గుమ్మడిదల, జనవరి 14: గుమ్మడిదల మండల కేంద్రంలోని డీసీసీబీ ఏటీఎంలో గుర్తు తెలియని దొంగలు గురువారం అర్ధరాత్రి చోరీకి యత్నించారు. బ్యాంక్ మేనేజర్ విష్ణువర్ధన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి చొరబడిన దొంగలు గునపాలతో మిషన్ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. అదే బిల్డింగ్లో నివాసం ఉంటున్న ఇంటి యజమాని శబ్ధం విని గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయినట్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న గుమ్మడిదల ఎస్ఐ విజయకృష్ణ నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తును ప్రారంభించారు.