భూమి కాజేసేందుకు అధికార పార్టీ నాయకుల యత్నం

ABN , First Publish Date - 2022-05-23T06:25:30+05:30 IST

రూరల్‌ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో అధికార పార్టీ నాయకులు ఆదివారం వేరొకరి భూమిని కాజేసేందుకు ప్రయత్నించగా, దాని యజమానులు అడ్డుకున్నారు.

భూమి కాజేసేందుకు అధికార పార్టీ నాయకుల యత్నం
కొలతలు వేయడాన్ని అడ్డుకుంటున్న భూ యజమానులు

అడ్డుకున్న యజమానులు

కదిరిఅర్బన, మే 22: రూరల్‌ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో అధికార పార్టీ నాయకులు ఆదివారం వేరొకరి భూమిని కాజేసేందుకు ప్రయత్నించగా, దాని యజమానులు అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు భూ యజమానులు ఇలా తెలియజేశారు. కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ 705 సర్వేలో 4. 49 ఎకరాల భూమిని 1982లో టి ఖాదర్‌బాషా, సయ్యద్‌, షా న్వాజ్‌ అనే ఇద్దరం కొనుగోలు చేశామన్నారు. అయితే అధికార పార్టీ స్థానిక నాయకులు నకిలీ దస్తావేజులు సృష్టించి తమకు సంబంధించిన భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వారు ఆదివారం మాకు చెందిన భూమిని కొలతలు వేయడానికి సర్వేయర్‌ను తీసుకొ చ్చారని, దానిని తాము అడ్డుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద వత్తిడి తెచ్చి తమపైనే కేసులు పెట్టించారని ఆవేదన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి తమ భూమికి అధికార పార్టీ నాయకుల నుంచి రక్షణ కల్పించాలని వారు కోరారు. 


Updated Date - 2022-05-23T06:25:30+05:30 IST