త్రివర్ణ కాంతుల వెలుగులో అట్టారీ బోర్డర్

ABN , First Publish Date - 2021-08-15T07:51:35+05:30 IST

భారత్-పాకిస్తాన్ మధ్య అత్యంత కాలక సరిహద్దు ప్రదేశమైన అట్టారీ ప్రాంతమంతా విద్యుత్ వెలుగుల్లో, త్రివర్ణ కాంతులతో..

త్రివర్ణ కాంతుల వెలుగులో అట్టారీ బోర్డర్

న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య అత్యంత కాలక సరిహద్దు ప్రదేశమైన అట్టారీ ప్రాంతమంతా విద్యుత్ వెలుగుల్లో, త్రివర్ణ కాంతులతో మెరిసిపోతోంది. ఆదివారం భారతదేశ 75వ స్వ్రాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో శనివారం అధికారులు అక్కడి భారతీయ భవనాలను ముస్తాబు చేయించారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘భారత్ మాతాకి జై’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో యూజర్.. ‘ఎంతో అందంగా ఉంది. జై హింద్’ అని రాసుకొచ్చాడు.


కాగా.. శనివారం భారత బీఎస్ఎఫ్ జవాన్లు, పాకిస్తాన్ రేంజర్లు అట్టారీ-వాఘా బోర్డర్ వద్ద మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Updated Date - 2021-08-15T07:51:35+05:30 IST