అట్టహాసంగా బండలాగుడు పోటీలు
ABN , First Publish Date - 2022-05-21T04:54:05+05:30 IST
అట్టహాసంగా బండలాగుడు పోటీలు
కేశంపేట, మే 20: మండలంలోని ఎక్లా్సఖాన్పేట గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బండలాగుడు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ పోటీలను ప్రారంభించారు. గద్వాల, పెబ్బెర్, వనపర్తి, తలకొండపల్లి మండలం రామకృష్ణాపురం, కర్ణాటక రాయిచూరు నుంచి ఔత్సాహిక రైతులు తమ ఎద్దులజతతో బండలాగుడు పోటీల్లో పాల్గొన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కార్యక్రమాలో పాల్గొన్నారు. వర్షం కురవడంతో పోటీలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. శనివారం పోటీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కొత్తపేట, ఎలికట్ట సర్పంచులు నవీన్కుమార్, సాయిప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవీన్కుమార్, సాయిప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, వెంకన్నయాదవ్, సరే్షయాదవ్, పర్వత్రెడ్డి, వేణుగోపాలచారి, ద్రోణాచారి, జమాల్ఖాన్, కాలేద్, మన్మధరెడ్డి, మాజీ ఎంపీటీసీ యాదగిరి, జంగయ్య, రామన్న పాల్గొన్నారు.