వాల్మీకులపై దాడులు హేయమైన చర్య

ABN , First Publish Date - 2021-04-13T06:11:00+05:30 IST

మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే జయంతి రోజునే కళ్యాణదుర్గంలో వాల్మీకు లపై అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దాడిచేయడం హేయ మైన చర్య అని ఏపీ వాల్మీకి సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పెనుకొంగ ఈశ్వరయ్య మండిపడ్డారు.

వాల్మీకులపై దాడులు హేయమైన చర్య
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న వాల్మీకి సంఘం నాయకులు

-ఏపీ వాల్మీకి సంఘం రాష్ట్ర కన్వీనర్‌  ఈశ్వరయ్య

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఏప్రిల్‌12: మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే జయంతి రోజునే కళ్యాణదుర్గంలో వాల్మీకు లపై అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దాడిచేయడం హేయ మైన చర్య అని ఏపీ వాల్మీకి సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పెనుకొంగ ఈశ్వరయ్య మండిపడ్డారు. ఆ సంఘం కార్యాలయం లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘంం జి ల్లా కార్యదర్శి రామకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. ఫూలే జయంతి వేడుకల్లో అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు వాల్మీకులపై దాడి చేసి, తిరిగి గాయపడిన వారిపైనే రాజకీ య పలుకుబడిని ఉపయోగించి కేసులు పెట్టడం దారుణమన్నారు. బాధ్యులైన వారిపై పోలీసు లు చర్యలు తీసుకొని... దాడిలో గాయపడిన వాల్మీకులకు అండగా నిలవాలన్నారు.   బాధి తులకు న్యాయం జరగకపోతే ఉద్యమాలకు వెనకాడమన్నారు. కార్యక్రమంలో నాయకులు మోహనబాబు, ఉద్యోగ సంఘం నాయకులు గంగాదర్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T06:11:00+05:30 IST