ఆలయాలపై దాడులు జరగకుండా చూడాలి: పాడేరు డీఎస్పీ
ABN , First Publish Date - 2021-01-24T06:17:53+05:30 IST
మండలంలో ఆలయాలపై ఎటువంటి దాడులు జరగకుండా గ్రామ సంరక్షక దళాలు చూడాలని పాడేరు డీఎస్పీ డాక్టర్ వీబీ.రాజ్కమల్ అన్నారు.
హుకుంపేట, జనవరి 23: మండలంలో ఆలయాలపై ఎటువంటి దాడులు జరగకుండా గ్రామ సంరక్షక దళాలు చూడాలని పాడేరు డీఎస్పీ డాక్టర్ వీబీ.రాజ్కమల్ అన్నారు. శనివారం ఆయన స్థానిక పోలీస్స్టేషన్లో గ్రామ సంరక్షక దళాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పరిధిలోని గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని, అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలన్నారు. అంతకుముందు డీఎస్పీ మండలంలో పరిస్థితులపై ఎస్ఐ పాపినాయుడుని అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో సీఐ పీపీ.నాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.