టీడీపీ కార్యాలయాలపై దాడులు హేయమైన చర్య

ABN , First Publish Date - 2021-10-20T06:25:19+05:30 IST

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై అధికార వైసీపీ శ్రేణులు దాడులు చేయ డం హేయమైన చర్య అని సీపీఐ జిల్లా కార్యద ర్శి జగదీష్‌ ఖండించారు.

టీడీపీ కార్యాలయాలపై దాడులు హేయమైన చర్య

సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 19: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై అధికార వైసీపీ శ్రేణులు దాడులు చేయ డం హేయమైన చర్య అని సీపీఐ జిల్లా కార్యద ర్శి జగదీష్‌ ఖండించారు. ప్రజాస్వామ్యంలో రా జకీయ విమర్శలు సర్వసాధారమనీ, భౌతిక దాడులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. అటు సీఎం నివాసం, ఇటు డీజీపీ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్రకార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ డం సిగ్గుచేటన్నారు. దాడులకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ బాధ్యత వహించాలన్నారు. వెంటనే డీజీపీని తొలగించాలనీ, క్షణం కూడా ఆ పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వైసీపీ అల్లరిమూకలు చేస్తున్న అరాచకాలను ప్రజలు నియంత్రించాలని కోరారు.

Updated Date - 2021-10-20T06:25:19+05:30 IST