పేకాట స్థావరాలపై దాడులు
ABN , First Publish Date - 2021-04-13T06:33:34+05:30 IST
పేకాట స్థావరాలపై దాడులు
రూ.29 వేల నగదు, 21 బైకులు, కారు స్వాధీనం
కుందుర్పి, ఏప్రిల్ 12: మండలంలోని శ్రీమజ్జనపల్లి, తెనగల్లు, యనుమలదొడ్డి గ్రా మాల్లో పేకాటస్థావరాలపై సోమవారం పోలీసులు దాడులు చేశారు. 21 ద్విచక్రవాహనాలు, కారును సీజ్ చేశారు. జూదరుల నుండి రూ.29 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 23 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు.