నాటుసారా స్థావరాలపై దాడులు
ABN , First Publish Date - 2020-08-09T10:06:10+05:30 IST
ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు ఎస్ఈబీ ఏఎస్పీ, ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించింది.
కర్నూలు, ఆగస్టు 8: ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు ఎస్ఈబీ ఏఎస్పీ, ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించింది. 804 కేసులు నమోదు చేసి 12,297 లీటర సారా, బెల్లం ఊటను జగన్నాథగట్టు వద్ద ధ్వంసం చేసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధాకర్, డీఎస్పీలు వినోద్కుమార్, వెంకట్రామయ్య, వెంకట్రావ్, చిదానందరెడ్డి, నరసింహారెడ్డి, జానకిరాం, సీఐలు పాల్గొన్నారు.