న్యాయవాదులపై దాడులు దుర్మార్గం : బార్ అసోసియేషన్
ABN , First Publish Date - 2021-07-31T06:09:32+05:30 IST
న్యాయవాదులపై దాడులు దుర్మార్గ చర్య అని సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపూడి వెంకటేశ్వర్రావు అన్నారు.
సూర్యాపేట లీగల్ / కోదాడ, జూలై 30 : న్యాయవాదులపై దాడులు దుర్మార్గ చర్య అని సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపూడి వెంకటేశ్వర్రావు అన్నారు. జార్ఘండ్లో న్యాయమూర్తి, న్యాయవాది హత్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్లో శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ న్యాయవ్యవస్థపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు బత్తిని వెంకటేశ్వర్లు, నాతీ సవీందర్, రేఖ సత్యం గ్రంథి వెంకటేశ్వర్లు, కాకి రాంరెడ్డి, శ్రావణ్కుమార్, కొంపల్లి లింగయ్య, నర్సింహ పాల్గొన్నారు. అదేవిధంగా కోదాడలోనూ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు తమ్మినేని హనుమంతరావు, రామిరెడ్డి, పద్మ, హేమలత, పాష, కోదండపాణి, నాగరాజు, నర్సయ్య పాల్గొన్నారు.