దళితులపై దాడులను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-05-18T05:38:32+05:30 IST

దళితులపై దాడులను అరికట్టాలి

దళితులపై దాడులను అరికట్టాలి

కందుకూరు, మే 17: దళితులపై జరుగుతున్న దాడులను పాలకులు అరికట్టాలని కులవివక్ష పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బొడ సామేలు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సంఘం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కులరక్కసి రూపుమాపేందుకు తమసంఘం ముందుడి పోరాటం చేస్తుందన్నారు. అనంతరం ఆసంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎ.కృష్ణ(సాయిరెడ్డిగూడ), కార్యదర్శిగా ఆర్‌.చందు(దెబ్బడగూడ), ఉపాధ్యక్షులుగా కె.రాములు, జి.రాధిక(కందుకూరు), ఎం.మంజుల (కొత్తగూడ), ఆర్‌.చంద్రయ్య(మురళీనగర్‌), సహాయ కార్యదర్శులుగా జి.మల్లే్‌ష(కందుకూరు చౌరస్తా), జి.సత్తయ్య(కొత్తూరు), కోశాధికారిగా ఎం.యాదయ్య,(నేదునూరు), కార్యవర్గ సభ్యులుగా వి.రాములు, ఇ.రవీందర్‌, ఆర్‌.యాదయ్య, కె.రజిత, డి.సువర్ణ, కె.అంజయ్యలను ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధగ్రామాల సంఘం నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:38:32+05:30 IST