వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి

ABN , First Publish Date - 2022-05-28T06:30:10+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నా యని డీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివప్రకాశ్‌ అన్నారు. నర్సీపట్నంలో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి
సమావేశంలో పాల్గొన్న దళిత సంఘాల ప్రతినిధులు

 డీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివప్రకాశ్‌

నర్సీపట్నం అర్బన్‌, మే 27 : వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నా యని డీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివప్రకాశ్‌ అన్నారు. నర్సీపట్నంలో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు.  బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వివాదం సృష్టించిన అగ్రకులాల వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే, ఎమ్మెల్సీ అనంతబాబును పదవి నుంచి తొలగించి, మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో డీహెచ్‌పీఎస్‌ ప్రతినిధులు డి.అప్పారావు, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:30:10+05:30 IST