బెల్టు దుకాణాలపై దాడులు

ABN , First Publish Date - 2021-01-27T06:00:12+05:30 IST

బెల్టు దుకాణాలపై దాడులు

బెల్టు దుకాణాలపై దాడులు

 శంకర్‌పల్లి: గణతంత్ర దినోత్సవం రోజు మద్యం విక్రయిస్తున్న బెల్టు దుకాణాలపై ఎస్‌ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలంలోని గోపులారంలో రెండు దుకాణాలు, పత్తేపూర్‌, సింగాపురం టవర్‌లో గల దుకాణాల్లో మద్యం అము్ముతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. 180ఎంఎల్‌ 200 బాటిల్స్‌, 12 ఫుల్‌ బాటిల్స్‌, 20 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2021-01-27T06:00:12+05:30 IST