ఇసుక అక్రమరవాణాపై దాడులు
ABN , First Publish Date - 2020-12-06T04:23:34+05:30 IST
ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో రెండురోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు.
నెల్లూరు(క్రైం)డిసెంబరు 5: ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో రెండురోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. శనివారం ఎస్ఐలు సుబ్బారావు, ముత్యాలరావులు నగరంలో వాహనాలను తనిఖీ చేశారు. వేదాయపాళెం జ్యోతినగర్లో ఎలాంటి బిల్లులు లేకుండా 4.5 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేశారు. అంబాపురానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కె. తిరుపాల్ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్తో పాటు తదుపరి విచారణ నిమిత్తం వేదాయపాళెం పోలీసులకు అప్పగించారు. వెంకటాచలం ఇసుకయార్డ్ నుంచి ఇసుకను తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.