యువకుడిపై కత్తులతో దాడి

ABN , First Publish Date - 2022-05-20T07:11:59+05:30 IST

మండలంలోని నొస్సం గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పాతకక్షలతో కత్తులతో దాడి చేసి గాయపరిచారు.

యువకుడిపై కత్తులతో దాడి

సంజామల, మే 19: మండలంలోని నొస్సం గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పాతకక్షలతో కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన గురువారం జరిగింది. గ్రామానికి చెందిన చిన్నముడియం మంగలి తేజేంద్ర గ్రామంలోని ధను బార్బర్‌ షాపులో ఉండగా అదే గ్రామానికి చెందిన గణేష్‌ అనే యువకుడు షాపులోకి వచ్చి మాట్లాడుతూ కూర్చున్నారు. ఆ సమయంలో షాపు యజమాని బయటికి వెళ్లాడు. వీరి మధ్య మాట మాట పెరగడంతో కోపోద్రిక్తుడైన గణేష్‌ షాపులో ఉన్న కత్తులతో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తేజేంద్రను పొడిచాడు. గతంలో గణేష్‌, తేజేంద్ర మధ్య ఘర్షణ జరిగింది. అప్పట్లో గణేష్‌ను తేజేంద్ర కొట్టినట్లు సమాచారం. దీన్ని మనస్సులో పెట్టుకున్న గణేష్‌ దాడి చేసి తేజేంద్రను తీవ్రంగా గాయపరిచాడు. తేజేంద్రకు జమ్మలమడుగు వైద్యశాలలో బుధవారం రాత్రి పరీక్షలు చేయించారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిమ్మారెడ్డి గురువారం తెలిపారు. 

Updated Date - 2022-05-20T07:11:59+05:30 IST