టీడీపీ కార్యాలయాలపై దాడి చేయడం దుర్మార్గం
ABN , First Publish Date - 2021-10-20T05:47:50+05:30 IST
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంగళగిరి, విశాఖపట్నం కా ర్యాలయాలపై వైసీపీ మూకల దాడి దుర్మార్గం అని, ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అద్దంకి శా సనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
రాష్ట్ర రాజకీయాల్లో విషసంస్కృతి మొదలు
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ధ్వజం
అద్దంకిటౌన్, అక్టోబరు 19 : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంగళగిరి, విశాఖపట్నం కా ర్యాలయాలపై వైసీపీ మూకల దాడి దుర్మార్గం అని, ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అద్దంకి శా సనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మం గళవారం ఆయన విడుదల చేసిన ప్రకటన సారాం శం ఇలా... ఏపీ రాజకీయాల్లో విషసంస్కృతి మొదలైంది. రాష్ట్రంలో అమలవుతుంది అంబేద్కర్ రా జ్యాంగమా, రాజారెడ్డి రాజ్యాంగమా.. రాష్ట్రంలో ప్ర జాస్వామ్యం అట్టడుగుకుపోయింది అనే దానికి పార్టీ కార్యాలయాలపై భౌతిక దాడులు, ఆస్తులు ధ్వంసం చేయడమే నిదర్శనం. ఇటీవల జడ్ ప్లస్ సె క్యూరిటీ ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి, ఇప్పుడు టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి చేయడం రాష్ట్రంలో ప్రతిపక్షానికే ర క్షణ లేదు ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? జాతీ య పార్టీ కార్యాలయంపై వందల మంది వైసీపీ గుండాలు వచ్చి దాడులు చేస్తుంటే డీజీపీ ఏమి చే స్తున్నారు. ప్రతిపక్షం పాలకపక్షం లోపాలను ప్రశ్ని స్తే ప్రభుత్వం లోపాలను సరిచేసుకోకుండా ఒక ని యంతలా వ్యవహరిస్తున్నారు. కాగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై, సానుభూతిపరులపై వైసీపీ గూండాల దాడిని ఖం డిస్తూ బుధవారం ఉ దయం అద్దంకిలోని బంగ్లారోడ్డులోని అం బేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని పార్టీ స్థానిక కా ర్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ హాజరవుతారని, నాయకులు, కార్యకర్తలు భా రీగా పాల్గొనాలని కోరింది.ఙ