మాజీ సర్పంచుపై దాడి
ABN , First Publish Date - 2022-05-23T05:04:56+05:30 IST
ప్పిరెడ్డి పల్లె మాజీ సర్పంచు, టీడీపీ నేత చీకిరి వెంకటసుబ్బయ్యపై వైసీపీ వర్గీ యులు దాడి చేయడంతో ఆయనకు బలమైన గాయా లయ్యాయి.
మైదుకూరు, మే22: తిప్పిరెడ్డి పల్లె మాజీ సర్పంచు, టీడీపీ నేత చీకిరి వెంకటసుబ్బయ్యపై వైసీపీ వర్గీ యులు దాడి చేయడంతో ఆయనకు బలమైన గాయా లయ్యాయి. వనిపెంట నుంచి తిప్పిరెడ్డిపల్లికి వెళు తుండగా జమాలయ్య సత్రం దగ్గర దాడి జరిగినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్షతగాత్రుడిని పోలీసులు ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.
వ్యక్తిపై దాడి - కేసు నమోదు
ఓబులవారిపల్లె, మే 22: మంగళంపల్లెకు చెందిన ఇద్దరిపైన ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్టీ కాలనీ వాసి తుమ్మల కన్నయ్యపై అదేగ్రామ వైసీపీ నేతలు కాకర్ల సుధాకర్నాయుడు, విష్ణుకుమార్ దాడి చేసి అసభ్యకరంగా తిట్టినట్లు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. తనకు పొలం పనులు చేయడానికి రాలేదని దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయపడిన తనని బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారన్నారు.