దివ్యాంగుడిపై టీఆర్ఎస్ నేత దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-08-24T18:43:51+05:30 IST

కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంటలో దారుణం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి ఓ దివ్యాంగుడు హాజరయ్యాడు. కార్యక్రమానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న గెల్లు శ్రీనివాస్‌తో పాటూ ఎమ్మెల్యే హాజరయ్యారు.

దివ్యాంగుడిపై టీఆర్ఎస్ నేత దౌర్జన్యం

కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంటలో దారుణం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి ఓ దివ్యాంగుడు హాజరయ్యాడు. కార్యక్రమానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న గెల్లు శ్రీనివాస్‌తో పాటూ ఎమ్మెల్యే హాజరయ్యారు. సభ జరుగుతున్నప్పటి నుంచి దివ్యాంగుడు రాజేష్.. తనకు పింఛన్ రావడం లేదని నాయకులను కలిసేందుకు ప్రయత్నించాడు. అయితే అతన్ని పోలీసులు, స్థానిక నాయకులు అడ్డుకున్నారు. సభ ముగిసిన తర్వాత దివ్యాంగుడు.. స్టేజి పైకి ఎక్కి తనకు పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదంటూ మైకులో చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ మహేంద్రాచారి.. ఆగ్రహంతో ఊగిపోయి, స్టేజి పైకి ఎక్కి దివ్యాంగుడు రాజేష్‌ను కిందకు లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. అక్కడున్న వారంతా ఆ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ ఇప్పించాల్సింది పోయి.. అడిగినవారిపై దాడి చేస్తారా.. అంటూ మండిపడ్డారు. మహేంద్రాచారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2021-08-24T18:43:51+05:30 IST