పోసాని ఇంటిపై దాడి అంతా నాటకం: రాజలింగం
ABN , First Publish Date - 2021-09-30T21:49:33+05:30 IST
దర్శకుడు పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోలేదని జనసేన నేత రాధరం రాజలింగం విమర్శించారు.
హైదరాబాద్: దర్శకుడు పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోలేదని జనసేన నేత రాధరం రాజలింగం విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అడిగితే లీగల్ ఒపీనియన్ కోసం పంపించామంటున్నారని, వివరణ అడిగితే కోర్టులో తేల్చుకోమంటున్న పోలీసులు చెబుతున్నారని తెలిపారు. పోసాని ఇంటిపై దాడి అంతా నాటకమని ఆరోపించారు. పోసాని తన వైఖరి మార్చుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా మహిళలు ముందుకు రావాలని రాధరం రాజలింగం కోరారు.