పేకాట స్థావరంపై దాడి.. భారీగా నగదు ఫ్రీజ్..

ABN , First Publish Date - 2021-09-17T01:40:53+05:30 IST

రాయదుర్గం: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు భారీగా నగదును ఫ్రీజ్ చేశారు. మణికొండలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట, కాయిన్స్ ఆడుతున్న ఓ ఇంటి పై మాదాపూర్ ఎస్‌వోటీ

పేకాట స్థావరంపై దాడి.. భారీగా నగదు ఫ్రీజ్..

రాయదుర్గం: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు.. భారీగా నగదును ఫ్రీజ్ చేశారు. మణికొండలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట, కాయిన్స్ ఆడుతున్న ఓ ఇంటి పై మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ప్రధాన నిర్వాహకుడు నీరజ్ కుమార్‌తో పాటు మొత్తం 13మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 1 కోటి 80 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుండి రూ.8,600 నగదు,19 మొబైల్ ఫోన్లు, 6 కార్లు, 493 కాయిన్స్, 8 పేకాట సెట్లను స్వాధీనం చేసుకున్నారు. జూదరుల బ్యాంక్ ఖాతాలో ఉన్న 90 లక్షల 30 వేల రూపాయల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం

Updated Date - 2021-09-17T01:40:53+05:30 IST