మహబూబాబాద్లో ఆస్పత్రిపై దాడి
ABN , First Publish Date - 2021-12-23T02:33:31+05:30 IST
పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై రోగి బంధువులు
మహబూబాబాద్: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై రోగి బంధువులు దాడికి పాల్పడ్డారు. మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గర్భిణికి తీవ్ర అస్వస్థత కలిగింది. దీంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రోగిని ఆస్పత్రి యాజమాన్యం తరలించింది. ఖమ్మం ఆస్పత్రిలో మహిళకు డెలివరీ చేశారు. కానీ శిశువు మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మహబూబాబాద్లోని ఆస్పత్రిపై గర్భిణి బంధువులు దాడి చేశారు. ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేశారు.