మహబూబాబాద్‌లో ఆస్పత్రిపై దాడి

ABN , First Publish Date - 2021-12-23T02:33:31+05:30 IST

పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై రోగి బంధువులు

మహబూబాబాద్‌లో ఆస్పత్రిపై దాడి

మహబూబాబాద్: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై రోగి బంధువులు దాడికి పాల్పడ్డారు. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గర్భిణికి తీవ్ర అస్వస్థత కలిగింది. దీంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రోగిని ఆస్పత్రి యాజమాన్యం తరలించింది. ఖమ్మం ఆస్పత్రిలో మహిళకు డెలివరీ చేశారు. కానీ శిశువు మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మహబూబాబాద్‌లోని ఆస్పత్రిపై గర్భిణి బంధువులు దాడి చేశారు. ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేశారు. 

Updated Date - 2021-12-23T02:33:31+05:30 IST