భార్యను కత్తితో పొడిచిన భర్త

ABN , First Publish Date - 2020-11-28T05:44:28+05:30 IST

డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన లంబాని రాజు భార్యను కత్తితో పొడిచినట్టు ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ తెలిపారు.

భార్యను కత్తితో పొడిచిన భర్త

డిచ్‌పల్లి, నవంబరు 27: డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన లంబాని రాజు భార్యను కత్తితో పొడిచినట్టు ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ తెలిపారు. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న కత్తితో భార్య కవితను పొడిచినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. రక్తస్రావంతో అపస్మారక స్థితిలోనున్న ఆమెను స్థా నికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. రాజును అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. 

Updated Date - 2020-11-28T05:44:28+05:30 IST