పూల వ్యాపారులపై యువకుల దాడి
ABN , First Publish Date - 2021-10-18T06:04:40+05:30 IST
పూల వ్యాపారులపై యువకుల దాడి
మట్టెవాడ, అక్టోబరు 17: అర్ధరాత్రి మద్యం మత్తులో పూల వ్యాపారిపై యువకులు దాడి చేసి గాయపరిచినట్లు ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపారు. ఇంతేజార్గంజ్సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం సీకేఎం ఆస్పత్రి రోడ్డులో శనివారం అర్ధరాత్రి పూల షాపు ముందు నిద్రిస్తున్న పూల వ్యాపారి దస్తగిరిని అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న యాప విజయ్, సంజయ్, మౌసిన్లు దస్తగిరిపై దాడి చేశారు. అడ్డువచ్చిన తోటి వ్యాపారులు, గమస్తాలను ముగ్గురు యువకులు దాడి చేసి గాయపరిచారు. దాడిలో యూసఫ్, సలీంలకు తీవ్రగాయాలు కాగా మరో నలుగురికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. దస్తగరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాప విజయ్, సంజయ్, మౌసిన్లతోపాటు వారి స్నేహితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల వరంగల్ హెడ్ పోస్టాపీసు బస్టాండ్ ప్రాంతంలో మద్యం మత్తులో యువకులు వీరంగాన్ని సృష్టిస్తున్న పలు ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.