ధర్మవరం ప్రెస్క్లబ్లో BJP leadersపై దాడి
ABN , First Publish Date - 2022-06-28T17:44:41+05:30 IST
ధర్మవరం ప్రెస్క్లబ్లో బీజేపీ నేతలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
శ్రీ సత్యసాయి: ధర్మవరం ప్రెస్క్లబ్లో బీజేపీ నేతల (BJP leaders)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. మంగళవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రెస్క్లబ్కు వచ్చిన వారిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దుండగులు స్కార్పియో వాహనాల్లో వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు బీజేపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ ప్లీనరీ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణపై వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలపై దాడి వెనుక ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి అనుచరుల ప్రమేయం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు.