యువకుడిపై స్ర్కూడ్రైవర్తో దాడి
ABN , First Publish Date - 2021-06-15T06:22:40+05:30 IST
పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవపురం లోని మసీదు వద్ద సోమవారం ఓ యువకుడిపై స్ర్కూడ్రైవర్తో కడుపులో పొడిచి గాయపరిచారు.
ధర్మవరంఅర్బన, జూన 14: పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవపురం లోని మసీదు వద్ద సోమవారం ఓ యువకుడిపై స్ర్కూడ్రైవర్తో కడుపులో పొడిచి గాయపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు....ఎస్బీఐ కా లనీకి చెందిన షెక్షావలి కుమారుడు నఫీజ్ అహమ్మద్ను లక్ష్మీచెన్నకేశవ పురంలోని మసీదు వద్ద ఓ వ్యక్తి స్ర్కూ డ్రైవర్తో కడుపులో పొడవగా తీవ్రంగా రక్తంపోవడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అనం తపురం ఆస్పత్రికి తరలించారు. షెక్షావలి రెండో వివాహం చేసుకున్నాడని సమాచారం తెలుసు కున్న మొదటి భార్య, కుమారుడు నఫీజ్అహమ్మద్లు వెళ్లి అక్కడ రెండో వివాహం చేసుకున్న మరో మహిళతో వాగ్వివాదానికి దిగారు. ఆ మహిళ బం ధువు వెనుక వైపు నుంచి వచ్చి పొడిచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. పోలీ సులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేప ట్టారు.