ఎంఎంటీఎస్లో మహిళపై దాడి
ABN , First Publish Date - 2021-12-21T22:49:31+05:30 IST
నగరంలోని ఎంఎంటీఎస్ ట్రైన్లో మహిళపై కత్తితో గుర్తు తెలియని
హైదరాబాద్: నగరంలోని ఎంఎంటీఎస్ ట్రైన్లో మహిళపై కత్తితో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. మహిళ దగ్గర నుంచి సెల్ఫోన్, నగదును దుండగుడు దోచుకెళ్లాడు. నిన్న రాత్రి శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో మహిళపై దాడి జరిగింది. కోచ్లో ఎవరూ లేకపోవడంతో మహిళపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. రాత్రి విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా కంపార్ట్మెంట్లో మహిళలకు భద్రత కల్పించాలని బాధితురాలు కోరారు.