ఆస్తి గొడవల కారణంగా మహిళపై కొడవళ్లతో దాడి

ABN , First Publish Date - 2020-08-10T16:40:59+05:30 IST

తిరుపతి: ఆస్తి తగాదాల కారణంగా తులసి అనే వివాహితపై కొడవళ్లతో దాడి జరిగింది. అన్నాచెల్లెళ్ల మధ్య నెలకొన్న ఆస్తి తగాదాల కారణంగా..

ఆస్తి గొడవల కారణంగా మహిళపై కొడవళ్లతో దాడి

తిరుపతి: ఆస్తి తగాదాల కారణంగా తులసి అనే వివాహితపై కొడవళ్లతో దాడి జరిగింది. అన్నాచెల్లెళ్ల మధ్య నెలకొన్న ఆస్తి తగాదాల కారణంగా చెల్లెలిపై అన్న బంధువులు దాడికి దిగారు. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నా... భూమిని ట్రాక్టర్లతో దున్నేందుకు తులసి అన్న ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న తులసిపై ప్రత్యర్థులు కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. తులసిని చికిత్స నిమత్తం గ్రామస్తులు 108లో పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Updated Date - 2020-08-10T16:40:59+05:30 IST