పడుకుని ఉన్న వృద్ధునిపై దాడి
ABN , First Publish Date - 2022-05-23T05:13:01+05:30 IST
కుటుంబీకులను దూషించాడనే నెపంతో నిద్రిస్తున్న అరిటాకుల శ్రీరాములుపై పాకం శ్రీనివాసు లు, పాకం పురుషోత్తం దాడిచేసి గాయ పరిచారు. పరిస్థితి విషమంగా మారడం తో శ్రీరాములకు కడప రిమ్స్కు తరలిం చారు. వివరాల్లోకెళితే....
పరిస్థితి విషమం
రిమ్స్కు తరలింపు
ఇద్దరిపై కేసు నమోదు
రాజంపేట, మే 22: కుటుంబీకులను దూషించాడనే నెపంతో నిద్రిస్తున్న అరిటాకుల శ్రీరాములుపై పాకం శ్రీనివాసు లు, పాకం పురుషోత్తం దాడిచేసి గాయ పరిచారు. పరిస్థితి విషమంగా మారడం తో శ్రీరాములకు కడప రిమ్స్కు తరలిం చారు. వివరాల్లోకెళితే....
అరిటాకుల శ్రీరాములు చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. శ్రీరాములుకి భార్య బిడ్డలు లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న అతనిపై పురుషోత్తం, శ్రీనివాసులు విచక్షణా రహితంగా దాడులు చేశారు. దీంతో గాయపడిన శ్రీరాములు రక్తపు మడుగు లో మునిగిపోయాడు. గ్రామస్తులు హు టాహుటిన అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన శ్రీరాములును రాత్రికి రాత్రే రాజంపేట ఆస్పత్రిలో ప్రధమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదుపై మన్నూరు పోలీ్సస్టేషన్లో కేసు నమోదు చేశారు. దాడి చేసిన ఇద్ద రు అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న ట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులపై దుర్భాషలాడాడన్న నెపంతో అన్నదమ్ము లు సైకోలుగా మారి కూలీనాలీ చేసుకుని జీవిస్తున్న శ్రీరాములుపై దాడి చే యడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.