పారిశుధ్య కార్మికుడిపై దాడి
ABN , First Publish Date - 2020-03-27T11:00:31+05:30 IST
స్థాపలాస, మార్చి 26: స్థానిక జయరామచంద్రపురంలో పారిశుధ్య కార్మికుడిపై బుధవారం రాత్రి ఓ
పలాస, మార్చి 26: స్థానిక జయరామచంద్రపురంలో పారిశుధ్య కార్మికుడిపై బుధవారం రాత్రి ఓ వలంటీర్ దాడిచేసిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... పారిశుధ్య కార్మికులు శేఖర్బిసాయ్, సుజాత బిసాయ్, కె.సతీష్ జయరామచంద్రపురంలో బ్లీచింగ్ చల్లుతున్నారు. ఈ గ్రామానికి చెందిన ఓ వలంటీరు తమ ఇళ్ల వద్దకూడా చల్లాలని కోరారు. అధికారులు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలు, కాలువల వద్దే బ్లీచింగ్ చేయాలని సూచించారని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో వలం టీరు పారిశుధ్య కార్మికుడు శేఖర్బిసాయ్పై చేయిచేసుకున్నాడు. అనంతరం ఈ విషయం కార్మిక సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే వలంటీరుపై చర్యలు తీసుకోవాలని కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పారిశుధ్య కార్మికసంఘ అధ్యక్షుడు సీహెచ్.మురుగన్ తెలిపారు. కార్మికులకు న్యాయం చేయకపోతే పారిశుధ్యపనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. కార్మికుడిపై దాడి జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని మునిసిపల్ కమిషనర్ టి.నాగేంద్ర కుమార్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఇరువర్గాలను పిలిచామని, ఈ విషయంపై విచారణ జరుపుతామని చెప్పారు.