మాజీ సర్పంచ్పై కర్రలతో దాడి
ABN , First Publish Date - 2022-08-15T08:23:40+05:30 IST
పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ భూక్యా బిచ్చపై ఆదివారం కొందరు దాడి చేశారు.
పాల్వంచ, ఆగస్టు 14: పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ భూక్యా బిచ్చపై ఆదివారం కొందరు దాడి చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. పాండురంగాపురానికి చెందిన కొర్రా వెంకటేష్, హతీరాం, రాంకుమార్ల మధ్య నగదు లావాదేవీలకు సంబంధించి పోలీస్స్టేషన్లో ఇరువర్గాల వారు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. నగదు పంచాయతీ పరిష్కారం కోసం పోలీస్స్టేషన్లో ఆటోలో వెళ్తుండగా హత్తిరాం, రాజ్కుమార్ను అడ్డగించి వెంటేష్పై కర్రలతో దాడి చేశారు. మధ్యలో సర్ది చెప్తుండగా బిచ్చపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బిచ్చ తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాంకుమార్, హత్తీరాంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.